మహిమలూరులో హత్య

ABN , First Publish Date - 2021-03-01T04:34:32+05:30 IST

మహిమలూరులో తోట వెంకటనరసయ్య(49) అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన శనివారం రాత్రి జరిగింది. మృతుడు కొందరు వ్యక్తులతో

మహిమలూరులో హత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ సోమయ్య

ఆత్మకూరు, ఫిబ్రవరి 28 : మహిమలూరులో తోట వెంకటనరసయ్య(49) అనే వ్యక్తి  హత్యకు గురైన ఘటన శనివారం రాత్రి జరిగింది. మృతుడు కొందరు వ్యక్తులతో శనివారం మద్యం విషయమై గొడవపడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఇంటి వరండాలో నిద్రపోతుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు. అయితే హత్యకు ఆ విషయమే కారణమై ఉంటుందా లేదా ఇంకేమైనా కారణం ఉందా అన్నది పూర్తి వివరాలు తెలియరావడంలేదు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ సోమయ్య, ఎస్‌ఐ రవినాయక్‌  ఘటనా స్థలిని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-01T04:34:32+05:30 IST