సిరిసిల్లలో దారుణ హత్య

ABN , First Publish Date - 2021-03-22T13:39:12+05:30 IST

పట్టణంలో దారుణ హత్య జరిగింది. శాంతినగర్‌లో

సిరిసిల్లలో దారుణ హత్య

సిరిసిల్ల: పట్టణంలో దారుణ హత్య జరిగింది. శాంతినగర్‌లో భైరి శ్రీనివాస్ రెడ్డి (45) నివాసం ఉంటున్నాడు. వీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో దుమాల శేఖర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. శ్రీనివాస్ రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను శేఖర్ అకారణంగా చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

Updated Date - 2021-03-22T13:39:12+05:30 IST