తాగిన మైకంలో తండ్రీకొడుకుల ఘర్షణ

ABN , First Publish Date - 2021-10-17T05:20:24+05:30 IST

తాగిన మైకంలో తండ్రీకొడుకుల ఘర్షణ

తాగిన మైకంలో తండ్రీకొడుకుల ఘర్షణ

 కొడుకు మృతి... కొత్తగట్టు సింగారంలో ఘటన

శాయంపేట, అక్టోబరు 16 : మద్యం మత్తులో ఉన్న తండ్రి.. తన కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన  శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారంలో చోటు చేసుకుంది. దసరా పండుగ రోజున ఈ ఘటన జరుగడంతో గ్రామస్థులు విషాదంలో మునిగి పోయారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, గ్రామస్థుల కథనం ప్రకారం..  కొత్తగట్టు సింగారానికి చెందిన రేగూరి పాపిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న కుమారుడు రవీందర్‌రెడ్డి(35)కి వెంకటాపురం మండలం ఇంచంచెరువుపల్లికి చెందిన యువతితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. రవీందర్‌రెడ్డి మద్యానికి బానిసై భార్యను తరుచూ వేధిస్తుండటంతో ఆమె కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది.  కాగా, శుక్రవారం దసరా పండుగ కావడంతో తండ్రీకొడుకులు మద్యం సేవించారు. ఈ క్రమంలో రవీందర్‌రెడ్డి మద్యం సేవించి తండ్రి పాపిరెడ్డితో గొడవ పడ్డాడు.  దీంతో పాపిరెడ్డి గొడ్డలితో తన కుమారుడైన రవీందర్‌రెడ్డి తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ రమే్‌షకుమార్‌, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు. 



 

Updated Date - 2021-10-17T05:20:24+05:30 IST