వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య
ABN , First Publish Date - 2020-05-30T15:22:21+05:30 IST
శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు గ్రామంలో పాతపక్షలు భగ్గుమన్నాయి. ఓ వర్గంపై మరో వర్గం మరణాయుధాలతో దాడికి
తిరుపతి: శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు గ్రామంలో పాతపక్షలు భగ్గుమన్నాయి. ఓ వర్గంపై మరో వర్గం మరణాయుధాలతో దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురి కాగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురూ వైసీపీ వర్గీయులే కావటం విశేషం. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి కేసులు లేకుండా పార్టీ నేతలు రాజకీయ పంచాయితీ చేస్తున్నారు.