ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలు

ABN , First Publish Date - 2020-07-09T15:12:24+05:30 IST

ఆస్తి తగాదాల కారణంగా మామను హత్యచేసిన కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. అరియలూరు జిల్లా సెందురై సమీపం కావేరిపాళయానికి చెందిన రైతు

ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలు

చెన్నై: ఆస్తి తగాదాల కారణంగా మామను హత్యచేసిన కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. అరియలూరు జిల్లా సెందురై సమీపం కావేరిపాళయానికి చెందిన రైతు తంగస్వామి (65)కి ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రామలింగం అనారోగ్యం కారణంగా 2010లో మృతిచెందాడు. దీంతో తంగస్వామి తనకున్న రెండెకరాల స్థలాన్ని కోడలికి రాసిచ్చాడు. ఈ ఆస్తి తగాదాల కారణంగా మామ, కోడలు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. మంగళవారం రాత్రి ఈ విషయమై వీరి మధ్య జరిగిన గొడవలు తారస్థాయికి చేరాయి. ఆవేశానికి గురైన కోడలు రాణి సమీపంలో ఉన్న ఇనుప రాడ్‌తో మామ తలపై బాదింది. తీవ్రంగా గాయపడిన అతను ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాణిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2020-07-09T15:12:24+05:30 IST