దేశాల మధ్య సాన్నిహిత్యం పెరగాలి
ABN , First Publish Date - 2021-11-26T16:16:12+05:30 IST
ప్రపంచంలో దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగితేనే శాంతిభద్రతలను కాపాడుకోవచ్చని భారత సైన్యం మాజీ సీనియర్ భద్రత అధికారి కల్నల్ మురుగానందం పేర్కొన్నారు. స్థానిక ఆళ్వార్పేటలోని రష్యన్ కల్చరల్
- కల్నల్ మురుగానందం
ప్యారీస్(చెన్నై): ప్రపంచంలో దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగితేనే శాంతిభద్రతలను కాపాడుకోవచ్చని భారత సైన్యం మాజీ సీనియర్ భద్రత అధికారి కల్నల్ మురుగానందం పేర్కొన్నారు. స్థానిక ఆళ్వార్పేటలోని రష్యన్ కల్చరల్ సెంటర్లో గురువారం ‘విశ్వశాంతి, భద్రత పరిరక్షణలో ఐక్యరాజ్య సమితి భద్రతాసంఘం కీలక పాత్ర’ అనే అంశంపై దక్షిణ భారత రష్యా ఉప రాయబారి ఓలెగ్అవదీవ్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఇందులో ప్రొఫెసర్ డా.ఎస్. మణివాసగం, చెన్నైలోని చైనా పరిశోధన కేంద్రం డైరెక్టర్ ఆర్ఎస్ వాసన్, మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి మాదేశ్వరన్, కల్నల్ మురుగానందం తదితరులు పాల్గొన్నారు.