ముస్సోరీ ఎమ్మెల్యే మోదీ కిచెన్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-03-30T14:56:59+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టేందుకు ముస్సోరీ ఎమ్మెల్యే గణేశ్ జోషి మోదీ పేరిట కిచెన్‌ను ప్రారంభించారు.....

ముస్సోరీ ఎమ్మెల్యే మోదీ కిచెన్ ప్రారంభం

ముస్సోరి (ఉత్తరాఖండ్): కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టేందుకు ముస్సోరీ ఎమ్మెల్యే గణేశ్ జోషి మోదీ పేరిట కిచెన్‌ను ప్రారంభించారు. దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భవననిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి భోజనం పెట్టేందుకే తాను మోదీ కిచెన్ ను ప్రారంభించామని బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చెప్పారు. ముస్సోరీ నగరంలోని రాజ్ పూర్, జఖాన్, దక్రా, దోవల్ వాలా ప్రాంతాల్లో ప్రతీరోజూ 500మంది పేదలకు ఆహారం పెడుతున్నట్లు గణేష్ పేర్కొన్నారు. లాక్ డౌన్ సందర్భంగా సామాజిక దూరం పాటించాల్సినందున తమ పార్టీ కార్యకర్తలు ఆహారాన్ని ప్రజల ఇళ్లకే అందిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. 

Updated Date - 2020-03-30T14:56:59+05:30 IST