వచ్చేనెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-25T03:57:25+05:30 IST

నూతన సాండ్‌ టా క్స్‌ పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఇసుకను రవాణ చేసేందుకు ఆసక్తి గల ట్రాక్టర్‌ యజమానులు వచ్చేనెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మనూచౌ దరి తెలిపారు.

వచ్చేనెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలి

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి24: నూతన సాండ్‌ టా క్స్‌ పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఇసుకను రవాణ చేసేందుకు ఆసక్తి గల ట్రాక్టర్‌ యజమానులు వచ్చేనెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మనూచౌ దరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ట్రాక్టరు యాజమానులతో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు.  మన ఇసుక మన వాహనం కార్యక్రమాన్ని చేపడుతున్నామ ని తెలిపారు. ఇసుక సప్లై చేసే ట్రాక్టర్‌ యజమానులు  త ప్పనిసరిగా ప్రభుత్వానికి రూ.25వేల డిపాజిట్‌ చేసుకోవాల ని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ అధికారులు, టెక్నికల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T03:57:25+05:30 IST