7లోగా వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-08-03T14:39:21+05:30 IST
ఖాళీగా ఉన్న గ్రామ వలంటీర్ల పోస్టులకు..
యడ్లపాడు: ఖాళీగా ఉన్న గ్రామ వలంటీర్ల పోస్టులకు ఈ నెల 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో పి.మాధురి కోరారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మండలంలోని నాలుగు గ్రామ సచివాలయాలకు సంబంధించి మొత్తం 7 వలంటీర్ల పోస్టులు ఖాళీ అయ్యాయన్నారు. వాటిలో వంకాయలపాడు-1(ఎస్టీ జనరల్), తిమ్మాపురం-3(ఓసీ జనరల్-1, ఓసీ మహిళ-1, బీసీ జనరల్-1), తుర్లపాడు-2(ఎస్సీ జనరల్-1, ఓసీ జనరల్-1), ఉన్నవ-1 (ఓసీ జనరల్) ఖాళీలు ఉన్నాయన్నారు. స్థానికులై ఉండి 10వ తరగతి పాసై ఉండాలన్నారు. అంతేగాకుండా జూన్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారై ఉండాలన్నారు.