సీఎంగా 40 ఏళ్లు జగనే ఉండాలి: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-07-25T19:32:41+05:30 IST

సీఎం జగన్‌పై సెటైర్లు వేయడంలో నర్సాపురం ఎంపీ రఘురామరాజు రూటే సపరేటు. ఎప్పుడు పొగుడుతారో.. ఎప్పుడు విమర్శిస్తారో అన్నట్టుగా ఆయన శైలి ఉంటుంది.

సీఎంగా 40 ఏళ్లు జగనే ఉండాలి: ఎంపీ రఘురామ

గుంటూరు: సీఎం జగన్‌పై సెటైర్లు వేయడంలో నర్సాపురం ఎంపీ రఘురామరాజు రూటే సపరేటు. ఎప్పుడు పొగుడుతారో.. ఎప్పుడు విమర్శిస్తారో అన్నట్టుగా ఆయన శైలి ఉంటుంది. నిందాస్తుతిని తలపిస్తుంటుంది ఆయన వ్యవహారం. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతంలో దుర్యోధనుడిలా సీఎం జగన్‌ అవ్వడం తనకు ఇష్టం లేదంటూనే, సీఎంగా 40 ఏళ్లు ఆయనే ఉండాలని అభిలషించారు. అంతలోనే ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల బ్యూరోక్రాట్స్‌కు కోర్టు మొట్టికాయలు వేసిందని, కోర్టుల చేత ఇన్ని అక్షింతలు వేయించుకున్న బ్యూరోక్రాట్స్ ఎవరూ లేరంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్ధుల విషయంలో అందరిదీ ఒక దారి అయితే ఏపీ సీఎంది ఇంకో దారి అని ఎద్దేవా చేశారు. సుప్రీం జోక్యంతో కరోనా వల్ల ఏపీ విద్యార్థులకు గండం తప్పిందని ఎంపీ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-25T19:32:41+05:30 IST