హరితహారానికి సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-19T05:57:40+05:30 IST

ఏడవ విడత హరితహారం కార్యక్రమానికి అధికారులు సిద్దంగా ఉండాలని జగిత్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు.

హరితహారానికి సిద్ధంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌

జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

జగిత్యాల టౌన్‌, జూన్‌ 18 : ఏడవ విడత హరితహారం కార్యక్రమానికి అధికారులు సిద్దంగా ఉండాలని జగిత్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా లోని అన్ని మండలాల ఎంపీడీవోలతో అభివృద్ధి కార్యక్రమాలపై జడ్పీ అధ్యక్షురాలు వసంత సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు విధిగా నిర్వహించి గ్రామాలు పచ్చదనంగా మారే లా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్క ల సంరక్షణపై ప్రత్యేక శ్రధ్ద వహించి రానున్న హరితహారంలో అన్ని రకా ల మొక్కలు నాటేలా గుంతలను తవ్వి ప్రణాళికలు సిద్ధం చేసేకోవాలని ఆదేశాలు జారీచేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీరు పోసి కాపాడాలన్నారు. ప్రగతి దశలో ఉన్న వైకుంఠదామాల నిర్మాణాలను పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వ ర్షాలు కురుస్తున్న దృష్ట్యా మురికినీరు నిలువకుండా జాగ్రత్తలు వహిం చేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భూగర్భజలాల పెంచే వి ధంగా ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరూ నిర్మించుకునేలా చర్యలు చే పట్టాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి సీఈవో వినోద్‌ కుమార్‌, డి ప్యూటీ సీఈవో సంధ్యారాణి, డీపీవో నరేష్‌ ఉన్నారు.


Updated Date - 2021-06-19T05:57:40+05:30 IST