అనాథలకు అండగా ఉండాలి: మంత్రి

ABN , First Publish Date - 2021-03-06T06:14:36+05:30 IST

అనాథలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఏంజిల్‌ ఆర్ఫనేజ్‌ హోంను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు.

అనాథలకు అండగా ఉండాలి: మంత్రి
మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 5: అనాథలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో  ఏంజిల్‌ ఆర్ఫనేజ్‌ హోంను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. అనాథ శరణాలయాలు అధికంగా ఉండాలని ఎవరూ కోరుకోరని, వారిని ఆదుకోవడానికి సేవాకేంద్రాలు ఏర్పాటు చేసుకోవటం తప్పటంలేదని అన్నారు. అనంతరం ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో మృతిచెందిన ప్రైవేట్‌ టీచర్‌ జానపాటి సైదులు కుటుంబాన్ని మంత్రి పరామర్శించి, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, వెంకటేశ్వర్లు, కుంభం రాజేందర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, క్రిస్టియన్‌ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, బాష, వెంకటేశ్వర్లు, దుర్గం ప్రభాకర్‌, సాల్మన్‌, థామస్‌, అబ్రహం పాల్గొన్నారు.  




Updated Date - 2021-03-06T06:14:36+05:30 IST