తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: బీజేపీ
ABN , First Publish Date - 2021-05-17T04:23:28+05:30 IST
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ నాయకుడు మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
అమరచింత, మే 16: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ నాయకుడు మల్లారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండల పరిధిలోని కిష్టంపల్లి రైతులకు అపార నష్టం వాటిల్లిందని ఆందోళన చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. కిష్టంపల్లి రైతులు స్థలం లేక ఆరుబయటనే ఆర బోస్తే అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆందోళన చెందారు. సింగిల్విండో అధికారులు గన్నీ బ్యాగులను కూడా సరఫరా చేయలేదని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.