చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-25T05:03:35+05:30 IST

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మాట్లాడుతున్న సీనియర్‌ న్యాయవాది భాస్కర్‌రెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 24: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు ఆవరణలో  ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని పురష్కరించుకుని న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనప్రజలకు చట్టాలపైన, లోక్‌ అదాలత్‌ గురించి అవగాహన కల్పించారు. గృహ హింసచట్టం, మహిళల చట్టాల గురించి తదితర సమస్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది భాస్కర్‌రెడ్డి, న్యాయవాదులు సుబ్బారెడ్డి, నజీర్‌, మునిసుబ్బారెడ్డి, రవికుమార్‌, జయన్న, సూచించాలోక్‌ అదాలత్‌ సభ్యురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T05:03:35+05:30 IST