రాజకీయాలు ఆపండి: బీజేపీపై సిద్ధూ ఫైర్

ABN , First Publish Date - 2022-01-07T21:40:29+05:30 IST

పని గట్టుకుని వాస్తవాలు పక్కన పెట్టి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కావాలని పంజాబ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ భజన చేసే కొన్ని చిలుకలైతే పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నాయి..

రాజకీయాలు ఆపండి: బీజేపీపై సిద్ధూ ఫైర్

చండీగఢ్: పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భద్రత లేదంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, పంజాబ్ నుంచి మోదీ తిరుగు ప్రయాణం అవ్వడంపై రాజకీయాలు చేయడం ఇక ఆపాలి పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేసి అదే పనిగా పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.


ప్రధాని మోదీ భద్రతా సమస్యపై సిద్ధూ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘పని గట్టుకుని వాస్తవాలు పక్కన పెట్టి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కావాలని పంజాబ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ భజన చేసే కొన్ని చిలుకలైతే పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చాలా రాజకీయాలు చేశారు. ఇక ఆపండి. మీకు సరైన సమాధానం తొందరలోనే వస్తుంది’’ అని సిద్ధూ అన్నారు.

Updated Date - 2022-01-07T21:40:29+05:30 IST