అభివృద్ధికి పాటుపడాలి

ABN , First Publish Date - 2022-02-20T04:24:29+05:30 IST

అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు.

అభివృద్ధికి పాటుపడాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 19: అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు.  జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశం ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సంక్షేమ, అభివృద్ధి పనులలో అధికారులు అలసత్వం వహించకూడదన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తూ ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అనంతరం ఆయా శాఖల వారీగా జరుగున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రత్నమాల, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-02-20T04:24:29+05:30 IST