సమాజసేవలో ముందుండాలి : జానయ్య
ABN , First Publish Date - 2021-01-16T05:14:40+05:30 IST
సమాజసేవలో యాదవ ఉద్యోగులు ముందుండాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్, అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ అన్నారు.
చివ్వెంల, జనవరి 15 : సమాజసేవలో యాదవ ఉద్యోగులు ముందుండాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్, అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ అన్నారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి దేవాలయంలో యాదవ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను వారు శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ వూర రాంమూర్తియాదవ్, బయ్య మల్లయ్యయాదవ్, వీరబోయిన వెంకటేశ్వర్లు, మద్ది శ్రీనివాస్యాదవ్, వజ్జె వీరయ్యయాదవ్, దావుల వీరప్రసాద్యాదవ్, బయ్య మల్లిఖార్జున్, తగ్గుళ్ళ జనార్థన్యాదవ్, యాదవు కులస్థులు పాల్గొన్నారు.