ముత్తూట్ గ్రూపు చైర్మన్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-03-07T06:14:08+05:30 IST
ముత్తూట్ గ్రూపు చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (72) ఇక లేరు. శుక్రవారం సాయంత్రం గుండె పోటుతో మరణించారు. గోల్డ్ లోన్స్కే పరిమితమైన ముత్తూట్ గ్రూపు..
న్యూఢిల్లీ: ముత్తూట్ గ్రూపు చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (72) ఇక లేరు. శుక్రవారం సాయంత్రం గుండె పోటుతో మరణించారు. గోల్డ్ లోన్స్కే పరిమితమైన ముత్తూట్ గ్రూపు.. ఆయన నిర్వహణలో దాదాపు 20 విభిన్న వ్యాపారాలకు విస్తరించింది. దేశంలో గోల్డ్ లోన్ వ్యాపారాన్ని సంస్థాగతం చేయడంలో ముత్తూట్ కీలక పాత్ర పోషించారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైన ముత్తూట్ ఫైనాన్స్ .. ఆయన నిర్వహణలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు, పశ్చిమాసియా దేశాలకూ విస్తరించింది.