ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-06T13:43:52+05:30 IST

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు.

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ కన్నుమూత

తిరువనంతపురం: ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆయన ముత్తూట్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పూర్తి పేరు మత్తయ్య జార్జ్ జార్జ్ ముత్తూట్. ఆయన సారధ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ దేశంలోనే గోల్డ్ లోన్ ఇచ్చే అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది. 


కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా ముత్తూట్ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. ముత్తూట్ ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా పలు శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని లక్షల మంది ఖాతాదారులు ఉన్నాయి. కాగా ఫోర్బ్స్ ఆసియా మేగజైన్... ఎంజీ జార్జ్ ముత్తూట్‌‌కు 2011లో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 50వ స్థానం ఇచ్చింది. 2019 నాటికి  జార్జ్ ముత్తూట్ 44వ స్థానానికి చేరుకున్నారు. 

Updated Date - 2021-03-06T13:43:52+05:30 IST