ఆ మూడక్షరాలు వింటే నా రక్తం పొంగుతుంది: బాలకృష్ణ

ABN , First Publish Date - 2020-05-28T16:28:38+05:30 IST

ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

ఆ మూడక్షరాలు వింటే నా రక్తం పొంగుతుంది: బాలకృష్ణ

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. బాలకృష్ణ, సుహాసిని నివాళులర్పించారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఆయన పుట్టిన రోజుంటే తెలుగువారందరికి పండగని అన్నారు. ’తెలుగు అనే మూడు అక్షరాలు వింటే నా ఒళ్లు పులకరిస్తుందని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారని.. అలాగే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం పొంగుతుందని’ అన్నారు. అందరూ అనుకున్నట్టు ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అని అనుకోనని, ‘ఎన్’ అంటే నటనాలయం, ‘టీ’ అంటే తారమందలంలోని తారక ధృవతారకుడు ‘ఆర్’ అంటే రాజర్షి రారాజు అని వర్ణించారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.

Updated Date - 2020-05-28T16:28:38+05:30 IST