అంబరాన్నంటే మైసూరు ఉత్సవాలు!
ABN , First Publish Date - 2021-10-11T05:30:00+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దసరా ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడటానికి దేశవిదేశాల...
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దసరా ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడటానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ ఉత్సవాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. దసరా ఉత్సవాల సమయంలో మైసూర్ ప్యాలెస్ విద్యుద్దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది. సుమారు లక్ష విద్యుద్దీపాలతో ప్యాలెస్ను అలంకరిస్తారు. పదిరోజుల పాటు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా రోజున చాముండేశ్వరీ మాత విగ్రహాన్ని చక్కగా అలంకరించిన ఏనుగుపై ఊరేగిస్తారు. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్ని మంటపం వరకు సాగే ఈ యాత్ర శోభాయమానంగా ఉంటుంది. ప్యాలెస్ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యప్రదర్శనలు నిర్వహిస్తారు.