తుక్కుతుక్కయిన బైక్.. దాని కిందే ఓ యువకుడి మృతదేహం.. యాక్సిడెంట్‌‌గా భావిస్తారనుకున్నారు.. కానీ..

ABN , First Publish Date - 2022-01-25T22:42:59+05:30 IST

బైక్ యాక్సిడెంట్ జరిగిందని, రోడ్డు పక్కన పొదల్లో మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

తుక్కుతుక్కయిన బైక్.. దాని కిందే ఓ యువకుడి మృతదేహం.. యాక్సిడెంట్‌‌గా భావిస్తారనుకున్నారు.. కానీ..

బైక్ యాక్సిడెంట్ జరిగిందని, రోడ్డు పక్కన పొదల్లో మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తుక్కుతుక్కయిన బైక్, దాని కిందే ఓ యువకుడి మృతదేహం కనిపించాయి. ముందు అది ఒక యాక్సిడెంట్ అనుకున్నారు. అయితే మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి అది హత్య అని నిర్ధారించారు. ఎవరో హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు భావిస్తున్నారు. రాజస్థాన్‌లోని మౌంట్ అబు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


మౌంట్ అబులో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న నరేంద్ర కుమార్ పెళ్లిలో ఫొటోలు తీసేందుకు మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరాడు. కొద్దిసేపటికి అతను రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అది యాక్సిడెంట్ కాదని, ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. మర్డర్ గానే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-01-25T22:42:59+05:30 IST