వీడిన మంచిర్యాల జంట హత్యల కేసు మిస్టరీ

ABN , First Publish Date - 2021-06-29T23:30:44+05:30 IST

జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో ఈ నెల 18న జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును పోలీసులు

వీడిన మంచిర్యాల జంట హత్యల కేసు మిస్టరీ

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో ఈ నెల 18న జరిగిన తల్లీకూతుళ్ల  హత్య కేసును పోలీసులు ఛేదించారు. అల్లుడు అరుణ్ కుమార్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన కిరాయి హంతకులు బిట్టు, సుబ్బారావులను అరుణ్ కలిసాడు. కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి తల్లీకూతుళ్లను అరుణ్ కుమార్ హత్య చేయించాడు. తన పైన వేధింపుల కేసు పెట్టడంతో హత్యలకు అరుణ్ పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు. 


Updated Date - 2021-06-29T23:30:44+05:30 IST