నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ బర్త్ డే పేరుతో దారుణం
ABN , First Publish Date - 2021-12-21T21:11:54+05:30 IST
నెల్లూరు జిల్లాలో సీఎం జగన్మోహన్రెడ్డి బర్త్డే పేరుతో దారుణం జరిగింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సీఎం జగన్మోహన్రెడ్డి బర్త్డే పేరుతో దారుణం జరిగింది. విద్యార్ధులను నాలుగు గంటలపాటు మండుటెండలో నిల్చోబెట్టి ఉపాధ్యాయులు నరకం చూపించారు. అతిథులకు స్వాగతం పలికేందుకు విద్యార్ధులను ఉపాధ్యాయులు ఎండలో నిల్చోబెట్టారు. కలిగిరి సిద్ధనకొండూరు జెడ్పీ హైస్కూల్లో జగన్ బర్త్ డే వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయులు తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.