నిజాయితీపరులకు జనసేనలో అవకాశం: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2021-11-02T02:05:47+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుందామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుందామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. యువతకు, నిజాయితీపరులకు జనసేనలో అవకాశం ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకువెళ్లిందన్నారు. మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టిన ఏకైక ప్రభుత్వం వైసీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.