15న నాగభైరవ జాతీయ పురస్కారాలు
ABN , First Publish Date - 2021-08-02T05:11:50+05:30 IST
సాహిత్యం, నాటక రంగాల్లో విశేష కృషి చే స్తున్న వారికి జాతీయ పురస్కారాలు అందజేయనున్నట్లు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తె లిపారు.
ఒంగోలు (కల్చరల్), ఆగస్టు 1: సాహిత్యం, నాటక రంగాల్లో విశేష కృషి చే స్తున్న వారికి జాతీయ పురస్కారాలు అందజేయనున్నట్లు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తె లిపారు. ఈనెల 15వ తేదీన ఒంగోలులో జరిగే సభలో పురస్కారాల ప్రదానం చేస్తామన్నారు. నవలల పోటీలో హైదరాబాద్కు చెందిన సలీం రచించిన ‘ఎడా రిపూలు’ ప్రథమ బహుమతికి, మంధనికి చెందిన చేతన వంశీ రచించిన ‘కోటి కొక్కడు’ ద్వితీయ బహుమతికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. పరిశోధనల పోటీలో కడపకు చెందిన అనుపాటి సుబ్బారాయుడు ‘గాధాసప్తశతి సౌందర్యగాథ’, కోట కు చెందిన డాక్టర్ పెళ్లూరు సునీల్ ‘దీర్ఘకవితావికాసం’ ప్రథమ, ద్వితీయ బహు మతులకు ఎంపిక చేశామన్నారు. వీరికి సాహిత్య పురస్కారంతో పాటు రూ.10 వేలు, రూ.5వేలు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ఇక కొత్తగా ప్ర వేశపెట్టిన నాగభైరవ నాటక పురస్కారానికి గుంటూరుకు చెందిన జరుగుల రా మారావును, నాగభైరవ ఆత్మీయ పురస్కారానికి నెల్లూరుకు చెందిన చిన్ని నారా యణరావును ఎంపిక చేసినట్లు ఆదినారాయణ వెల్లడించారు.