సింగిల్స్కు నగాల్ అర్హత
ABN , First Publish Date - 2021-07-17T08:17:10+05:30 IST
సుమిత్ నగాల్కు ఒలింపిక్స్ టెన్నిస్ సింగిల్స్లో తలపడే అవకాశం లభించింది.
డబుల్స్ ఆడించాలని ఏఐటీఏ నిర్ణయం
న్యూఢిల్లీ: సుమిత్ నగాల్కు ఒలింపిక్స్ టెన్నిస్ సింగిల్స్లో తలపడే అవకాశం లభించింది. కరోనాతో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు వైదొలగిన దరిమిలా విశ్వక్రీడల అర్హత మార్క్ పరిధిలోకి నగాల్ వచ్చాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) శుక్రవారం తెలియజేసింది. దాంతో పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్నతో కలిసి నగాల్ను బరిలో దించాలని అఖిలభారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) నిర్ణయించింది. ఈమేరకు ఐటీఎఫ్ అనుమతి కోరింది. ఇంతకుముందు డబుల్స్లో బోపన్నకు జతగా దివిజ్ శరణ్ను ఏఐటీఏ ఖరారు చేసింది. కానీ ప్రస్తుతం దివిజ్కు బదులు నగాల్ను బోపన్నతో బరిలో దించాలని భావిస్తోంది.