నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలి
ABN , First Publish Date - 2022-01-29T06:44:31+05:30 IST
నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని పుత్తూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి ధనపాల్ డిమాండ్ చేశారు.
పుత్తూరు టౌన్, జనవరి 28: నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని పుత్తూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి ధనపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరి నియోజకవర్గానికి బాలాజీ జిల్లాలో కొలువైన వేంకటేశ్వరస్వామికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తిరుపతికి పక్కనే ఉన్న నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు.అనంతరం మున్సిపల్ అధికారులకు ఈ విషయమై వినతి పత్రం అందజేశారు. బీఎస్ గణేష్, షణ్ముగ రెడ్డి, అశోక్, మాజీ మున్సిపల్ చైర్మన్ యుగంధర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేలు, ఎన్.ధనపాల్, తదితర నాయకులు పాల్గొన్నారు.