సాగర్‌లో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నాం: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-03-27T23:11:11+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సాగర్‌లో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నాం: ఉత్తమ్

నల్గొండ: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిరుగుతుందని చెప్పారు. సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభాలకు గురిచేస్తారని, అయినా నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు. సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-03-27T23:11:11+05:30 IST