Telangana: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద

ABN , First Publish Date - 2021-08-14T13:09:18+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Telangana: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 40,406 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 68,703 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను...ప్రస్తుతం నీటి నిలువ 311.4474 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-08-14T13:09:18+05:30 IST