Nallagonda: 588.20 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం
ABN , First Publish Date - 2021-08-23T14:21:38+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువగా ఉంది.
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 21,432 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 25,342 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుతం 588.20 అడుగులకు చేరింది. మొత్తం నీటిసామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 306.6922 టీఎంసీలకు చేరింది.