ఇంకా జీజీహెచ్లో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్ర
ABN , First Publish Date - 2020-10-30T19:50:55+05:30 IST
దివ్యతేజస్విని హత్య కేసు నిందితుడిని డిశ్చార్జ్ చేసేందుకు మరింత సమయం పడుతుందని..
గుంటూరు: దివ్యతేజస్విని హత్య కేసు నిందితుడిని డిశ్చార్జ్ చేసేందుకు మరింత సమయం పడుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్రకు అధిక రక్తస్రావం కావటంతో రోగ నిరోధకశక్తి తగ్గిందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసిన గాయం ఇంకా పూర్తిగా మానలేదన్నారు. ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందని, గాయం మానిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ప్రభావతి చెప్పారు. కాగా నాగేంద్ర ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ కాగానే అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. విజయవాడలోని క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన దివ్య తేజశ్వినిని నాగేంద్ర కత్తితో దాడిచేసి హత్య చేసిన విషయం తెలిసిందే.