సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన నాగేశ్వర్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-15T04:09:38+05:30 IST
మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల నాగేశ్వర్రెడ్డి గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిశారు.
మిరుదొడ్డి, అక్టోబరు 14: మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల నాగేశ్వర్రెడ్డి గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ఆయనకు వివరించారు. దుబ్బాక నియోజకవర్గంలో త్వరలో చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు ఎన్వీ రమణను ఆహ్వానించినట్లు నాగేశ్వర్రెడ్డి తెలిపారు.