కరోనా కోరల్లో నాయుడుపేట డివిజన్‌

ABN , First Publish Date - 2020-04-09T11:30:36+05:30 IST

నాయుడుపేట డివిజన్‌లో కరోనా కోరలు చాచింది. మంగళవారం వరకు నాయుడుపేటలో 8, తడ 1, ఓజిలి 1 మొత్తం 10

కరోనా కోరల్లో నాయుడుపేట డివిజన్‌

నాయుడుపేట, ఏప్రిల్‌ 8 : నాయుడుపేట డివిజన్‌లో కరోనా కోరలు చాచింది. మంగళవారం వరకు నాయుడుపేటలో 8, తడ 1, ఓజిలి 1 మొత్తం 10 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా బుధవారం తడలో 2, నాయుడుపేటలో 1 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నాయుడుపేటలో 9,  తడలో 3, ఓజిలిలో 1 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. డిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు నాయుడుపేట మండలంలో 21 మంది, ఓజిలిలో 9 మంది, తడలో 1, సూళ్లూరుపేటలో ముగ్గురు క్వారంటైన్‌లో ఉన్నారు.  


మేనకూరు సెజ్‌లో 100 ఐసోలేషన్‌ గదులు 

నాయుడుపేట డివిజన్‌లో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్న దృష్ఠ్యా మేనకూరు సెజ్‌లోని ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయంలో 100 ఐసోలేషన్‌ బెడ్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్‌ కట్టా సుధాకర్‌రెడ్డి, ఆర్డీవో సరోజినీ. డీపీవో డాక్టర్‌ రమాదేవి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్‌ దేదీప్యారెడ్డి, తహసీల్దారు శ్రీనివాసులు, డీటీ గోపీనాథ్‌రెడ్డి, డీహెచ్‌ఈ దాసరి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.  నాయుడుపేట డివిజన్‌లో కరోనా పాజిటివ్‌లు పెరుగుతుండటంతో పారిశుధ్య కార్మికులు నిరంతరం బ్లీ చింగ్‌, సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేస్తున్నారు.  

Updated Date - 2020-04-09T11:30:36+05:30 IST