ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడు

ABN , First Publish Date - 2021-01-18T05:10:41+05:30 IST

తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని జిల్లా టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడు
మేగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న టీడీపీ నేతలు ఆనందబాబు, ఆలపాటి, నసీర్‌ తదితరులు

జిల్లా టీడీపీ నేతలు

గుంటూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని జిల్లా టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని బస్టాండ్‌ సెంటర్‌లోని రెడ్‌ ట్యాంక్‌ కాంపౌండ్‌లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ ఏర్పాటు ఆదివారం ఏర్పాటుచేసిన మహా రక్తదాన శిబిరాన్ని వీరిరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రంపచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో నేతలు డేగల ప్రభాకర్‌, చిట్టాబత్తిని చిట్టిబాబు, ఎస్‌ఎస్‌పీ జాదా, గోళ్ల ప్రభాకర్‌, ఎస్కే అన్వర్‌, రబ్బానీ, బ్రహ్మసాని శ్రీనివాసరావు, పి.జమీర్‌, సూరే శ్రీనివాసరావులతో డివిజన్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-18T05:10:41+05:30 IST