వైసీపీ నేతలు జగన్కు కట్టు బానిసలుగా మారారు: ఆనందబాబు
ABN , First Publish Date - 2020-08-04T22:37:34+05:30 IST
వైసీపీ నేతలు జగన్కు కట్టు బానిసలుగా మారారు: ఆనందబాబు
గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. జగన్కు దమ్ముంటే చంద్రబాబు సవాల్పై స్పందించాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. జగన్ ప్రజలను నమ్మించి మోసం చేశారని, ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని, మూడు ప్రాంతాల మధ్య చిచ్చురేపడానికే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని ఆనందబాబు ఆరోపించారు. కృష్ణా, గుంటూరు వైసీపీ నేతలు జగన్కు కట్టు బానిసలుగా మారారని ఆనందబాబు విమర్శించారు.