Nalgonda: చిట్యాలలో లారీని ఢీకొన్న ట్రావేల్స్ బస్సు..8 మందికి గాయాలు
ABN , First Publish Date - 2021-08-02T13:29:18+05:30 IST
చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా..డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది...
నల్గొండ: చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా..డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను, డ్రైవర్ను కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెలిమినేడు శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.