పబ్లిక్ నల్లా స్థలం కబ్జా
ABN , First Publish Date - 2021-05-08T06:39:34+05:30 IST
అడ్డగుట్ట కమ్యూనిటీహాల్ సమీపంలో పబ్లిక్ నల్లా స్థలాన్ని కబ్జా చేశారు. నల్లాను తొలగించారంటూ సీపీఎం కార్యదర్శి అజయ్బాబు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గంట రాజుసాగర్, పలు పార్టీల నేతలు మారేడ్పల్లి తహసీల్దార్ సునీల్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
అడ్డగుట్ట, మే 7 (ఆంధ్రజ్యోతి): అడ్డగుట్ట కమ్యూనిటీహాల్ సమీపంలో పబ్లిక్ నల్లా స్థలాన్ని కబ్జా చేశారు. నల్లాను తొలగించారంటూ సీపీఎం కార్యదర్శి అజయ్బాబు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గంట రాజుసాగర్, పలు పార్టీల నేతలు మారేడ్పల్లి తహసీల్దార్ సునీల్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నల్లా స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ నాయకుడు వెంకట్ నల్లాను తొలగించి స్థలాన్ని వేరేవాళ్లకు అప్పగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.