నల్లా సూర్యచంద్రరావు విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2021-10-22T05:55:44+05:30 IST
పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద కాపు రిజర్వేషన్ పోరాటసమితి రాష్ట్ర కన్వీనర్ దివంగత నల్లా సూర్యచంద్రరావు విగ్రహాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఆవిష్కరించారు.
పి.గన్నవరం, అక్టోబరు 21: పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద కాపు రిజర్వేషన్ పోరాటసమితి రాష్ట్ర కన్వీనర్ దివంగత నల్లా సూర్యచంద్రరావు విగ్రహాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఆవిష్కరించారు. నల్లా పెద్దకాపు, కర్రి వెంకటరత్నం, నల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సూర్యచంద్రరావు విగ్రహానికి తనయులు అజయ్, సంజయ్లతో కలిసి ఆయన పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణుమూర్తి, స్వామి, నల్లా పవన్, కొమ్మురి మల్లిబాబు, అడ్డగళ్ల వెంకటసాయిరాం, ఉలిశెట్టి బాబి, భీమాల వెంకటేశ్వరరావు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, యడ్ల ఏసు తదితరులు పాల్గొన్నారు.