రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

ABN , First Publish Date - 2021-06-16T12:42:19+05:30 IST

జిల్లాలోని చింతపల్లి మండలం కుర్మెడు గేట్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, రెండేళ్ల కూతురు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

నల్లగొండ: జిల్లాలోని  చింతపల్లి మండలం కుర్మెడు గేట్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, రెండేళ్ల కూతురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు, జేసీబీ ఢీ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మండలంలోని హోమంతాల పల్లి గ్రామానికి చెందిన వలమల రమేష్(30), అక్షర(2)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-16T12:42:19+05:30 IST