నల్లగొండలో యువతి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-07-13T15:21:30+05:30 IST
జిల్లాలోని కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో చింతమల్ల ప్రీతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
నల్లగొండ: జిల్లాలోని కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో చింతమల్ల ప్రీతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొప్పోలు గ్రామ శివారులో యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారామిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.