Nallagonda మెడికల్ కాలేజ్లో విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2021-11-11T15:36:40+05:30 IST
జిల్లా మెడికల్ కళాశాలలో వారం రోజులుగా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
నల్లగొండ: జిల్లా మెడికల్ కళాశాలలో వారం రోజులుగా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహించాలంటూ ఈ నెల 5 నుంచి ఆన్లైన్ క్లాసులకు లాగిన్ కాకుండా విద్యార్థులు మూకుమ్మడి నిరసన చేపట్టారు. రాష్ట్రమంతా ఆఫ్లైన్ క్లాసులు జరుగుతున్నా ఇక్కడ లేవని విద్యార్థుల ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే అడ్మిషన్ తీసుకుని వన్ ఇయర్ అవుతున్నా తరగతి గదులే చూడలేదని విద్యార్థులు చెబుతున్నారు. జనవరిలో ప్రీఫైనల్ పరీక్షలు ఎలా రాయలంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటీకే పలుమార్లు ప్రిన్సిపాల్, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాక్టీకల్స్ పేరుతో తమనే బెదిరిస్తున్నారన్నారు. ఈ నెల 15న తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేయాలని విద్యార్థులు సన్నాహకాలు చేస్తున్నారు. తమ ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.