నల్లగొండలో దారుణం
ABN , First Publish Date - 2021-12-17T14:27:19+05:30 IST
జిల్లాలోని కనగల్ మండలం ఎడవెల్లిలో దారుణం జరిగింది.
నల్గొండ: జిల్లాలోని కనగల్ మండలం ఎడవెల్లిలో దారుణం జరిగింది. భూ వివాదాలతో మహిళపై దాయాదులు దాడి చేశారు. దెబ్బలకు తాళలేక భాదితురాలు తిరుపతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.