Nallagonda: తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌కు పితృవియోగం

ABN , First Publish Date - 2021-12-18T18:08:48+05:30 IST

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు పితృవియోగం కలిగింది. కిషోర్ తండ్రి గాదరి మారయ్య(73) గుండె పోటుతో మృతి చెందారు.

Nallagonda: తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌కు పితృవియోగం

నల్గొండ: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు పితృవియోగం కలిగింది. కిషోర్ తండ్రి గాదరి మారయ్య(73) గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోన్‌‌లో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను పరామర్శించి, సంతాపం ప్రకటించారు. నల్గొండలోని ఎమ్మెల్యే కిషోర్ నివాసంలో మారయ్య భౌతిక కాయానికి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2021-12-18T18:08:48+05:30 IST