తిరుపతి ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తారు: నల్లారి కిషోర్
ABN , First Publish Date - 2020-11-26T21:04:44+05:30 IST
ధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ప్రజలంతా ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తుగా ఓడిస్తారని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నల్లారి కిషోర్ ..
తిరుపతి: అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ప్రజలంతా ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తుగా ఓడిస్తారని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అదేశాలతో నాయకుల సమన్వయంతో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పనభాక లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన అన్నారు.
తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యదిక మెజార్టీ సాధించేందుకు నాయకులంతా కష్టపడి పనిచేయాలని చెప్పారు. వైసీపీ విధానాలపై ప్రజలు విసిగి పోతున్నారన్నారు. ప్రజల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఎత్తుగడలు పనిచేయవని ఆయన జోస్యం చెప్పారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు అందరూ టీడీపీ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.