విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి: నామా

ABN , First Publish Date - 2021-11-28T23:43:59+05:30 IST

ప్రభుత్వం 37 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి: నామా

ఢిల్లీ: ప్రభుత్వం 37 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నామా మీడియాతో మాట్లాడుతూ గతంలో మాదిరిగా చర్చ లేకుండా బిల్లులను పాస్ చేయొద్దని కోరామన్నారు. పార్లమెంట్‌లో ముందు ప్రజాసమస్యలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశామని తెలిపారు. తెలంగాణ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కృష్ణా జలాల అంశంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని నామా నాగేశ్వరరావు కోరారు.

Updated Date - 2021-11-28T23:43:59+05:30 IST