సంప్రదాయ వస్త్రధారణతో నుదుట నామాలు పెట్టుకున్న జగన్
ABN , First Publish Date - 2020-09-23T23:59:54+05:30 IST
బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం జగన్ పూజలు చేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు జగన్కు పరివట్టం కట్టారు. సంప్రదాయ వస్త్రధారణతో
తిరుమల: బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం జగన్ పూజలు చేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు జగన్కు పరివట్టం కట్టారు. సంప్రదాయ వస్త్రధారణతో సీఎం నుదుట నామాలు పెట్టుకున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఊరేగింపుగా జగన్ బయలుదేరారు. సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారికి సమర్పించే సారెను తీసుకుని.. మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత వకుళమాతను దర్శించుకుని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో నిర్వహించనున్న గరుడవాహన సేవలో పాల్గొంటారు.