నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-17T06:13:46+05:30 IST
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్, ఏప్రిల్ 16: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియ మొదలైన దృష్ట్యా నామినేషన్ల స్వీకరణకు డీఆర్డీఏ, సహకార, నగరపాలక సంస్థ, జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు ఆర్అండ్బీ శాఖల కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ అను రాగ్ జయంతి తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే వారితో సహాయకులు సీటింగ్ విధానం, నామినేషన్ల సమర్పించే ప్రక్రియ ను కలెక్టర్ పరిశీలించారు. కొవిడ్ -19 నిబంధనలను విధిగా పాటిం చాలని సూచించారు. అధికారులు, సిబ్బంది నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాల న్నారు. వారి వెంట నగరపాలక అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి తదితరులున్నారు.