అమెరికాలోని అభిమానులతో నందమూరి బాలకృష్ణ ఇష్టాగోష్ఠి

ABN , First Publish Date - 2020-06-12T02:23:34+05:30 IST

నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమెరికాలోని

అమెరికాలోని అభిమానులతో నందమూరి బాలకృష్ణ ఇష్టాగోష్ఠి

కాలిఫోర్నియా: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమెరికాలోని తన అభిమానులతో జూమ్ యాప్ ద్వారా ఇష్టాగోష్ఠి జరిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే అమెరికా వ్యాప్తంగా బాలకృష్ణ 60వ జన్మదినాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని వివిధ నగరాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, పోస్టల్ శాఖ, అగ్నిమాపక సిబ్భందికి భోజనం, నిత్యావసర వస్తువులు, మాస్క్‌లు, గ్లోవ్స్, శానిటైజర్స్ పంపిణి చేశారు. కాగా.. బాలకృష్ణతో జరిగిన ఈ అభిమానుల సమావేశంలో వివిధ మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున్న అమెరికాలోని బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు జై బాలయ్యా అంటూ, బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మన్నవ మోహనకృష్ణ, రవి పొట్లూరి నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తన జన్మదినం సందర్భంగా అమెరికాలోని తన అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తాను గతంలో ఎప్పుడు అమెరికా వచ్చినా అభిమానులు బ్రహ్మరథం పట్టారని, వారి అభిమానాన్ని, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల సందర్భంగా అమెరికాలో విమానాశ్రయం నుంచి అడుగడుగునా తనపై చూపించిన అభిమానానికి ఎంతో ముగ్ధుడయ్యానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న నటీమణులు లయ, అంకిత పాల్గొన్నారు. మరోపక్క ఈ కార్యక్రమంలో యాంకర్ రవి, ఇమిటేషన్ రాజు, గాయని గాయకులు కౌశల్య, సింహ, పృథ్వి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-12T02:23:34+05:30 IST