హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-02-25T05:03:19+05:30 IST

హత్య కేసులో నిందితుడు శివప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ కంబగిరి రాముడు బుధవారం తెలిపారు. నంద్యాలలోని వెంకటాచలం కాలనీకి చెందిన జయలక్ష్మి (37) స్థానిక సంజీవనగర్‌ సెంటర్‌లోని ఓ పెట్రోల్‌ బంకులో పని చేస్తుండేది.

హత్య కేసులో నిందితుడి అరెస్టు

నంద్యాల (నూనెపల్లె), ఫిబ్రవరి 24: హత్య కేసులో నిందితుడు శివప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ కంబగిరి రాముడు బుధవారం తెలిపారు. నంద్యాలలోని వెంకటాచలం కాలనీకి చెందిన జయలక్ష్మి (37) స్థానిక సంజీవనగర్‌ సెంటర్‌లోని ఓ పెట్రోల్‌ బంకులో పని చేస్తుండేది. జయలక్ష్మితో మహానంది మండలం యు.బొల్లవరం గ్రామానికి చెందిన శివప్రసాద్‌ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో మాట్లాడేందుకు శివప్రసాద్‌ ఫిబ్రవరి 14వ తేదీన పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చి జయలక్ష్మితో మాట్లాడి అనంతరం ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ జయలక్ష్మిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవలకు కర్నూలుకు తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే చికిత్స పొందుతున్న జయలక్ష్మి కోలుకోలేక మృతి చెందడంతో హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడు శివప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని టూటౌన్‌ సీఐ కంబగిరి రాముడు తెలిపారు.

Updated Date - 2021-02-25T05:03:19+05:30 IST